Appam, Appam - Telugu

జూన్ 18 – ఓటమి యందు ఆదరణ

“యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని  రక్షణ యెహోవా అధీనము”    (సామెతలు. 21:31).”

ఓటమీలనంతా నూతన ఆశీర్వాదములకైన త్రోవగా ప్రభువు మార్చి ఇచ్చును.  ఓటమి మిమ్ములను క్రింద త్రోసివేయును అని తలంచి సొమ్మసిల్లి పోకుడి. ప్రభువు మీతో కూడా ఉండుటచేత అదియే ఆశీర్వాదము యొక్క నిచ్చెనగా మారిపోవును.

జనులు నేడు పలు విధములైన పిరికితనము ఆత్మలచే పీడించబడియున్నారు. వ్యాధులు వచ్చునేమో? ఉద్యోగము పోవునేమో? ఇతరులు మనకు శత్రువులై పోవుదురేమో? భర్త చేయ్యి విడిచి పెడతాడేమో?  బిడ్డలు మరణించుదురేమో? భవిష్యత్కాలము ఎలాగు ఉండునేమో అనియంతా తలంచి తలంచి భయపడుచున్నారు, కలత చెందుచున్నారు!  ఓటమి యొక్క తలంపులతో కూడా  ఆరాటపడుచున్నారు. ఓటమి వచ్చుటకు ముందుగానే, ఓటమి భావాలు వారిని అధికమించుచున్నది.

ఓటమీలచే దెబ్బతిన్నవారు, లోకస్థుల మధ్యన రెండు అంశములను చేయవచ్చును. ఒకటి మనస్సునందు నొచ్చుకొని నిరుత్సాహము చెందవచ్చును. లేక పౌరుషము గలవారై ఓటమిని విజయముగా మార్చుటకు ప్రయత్నము చేయవచ్చును.

అగ్ని ఒక్కటే, అయితే అది పడుచున్నప్పుడు మైనము నీళ్లవలె కరిగి పోవుచున్నది. అగ్నిచే జిగటమన్నైయితే బిగిసుకొని బలము పొందుచున్నది. ఓటమి అనేది ఒక్కటే. లోకస్థులు ఆదరణ పొందలేకుండా బాదపడుచు, నీరసిల్లి పోవుచు జీవితమును చేదుమయముగా చేసుకొనుచున్నారు. అయితే, దేవుని యొక్క బిడ్డలు కన్నీటి లోయలో నడిచి వెళ్లి, దానిని  నీటియూటగా చేసుకొనుచున్నారు. దాని కొరకే క్రీస్తు తన యొక్క జీవమును మరణము నందు కుమ్మరించి ఇచ్చెను అను సంగతిని మరిచిపోకుడి.

ఏదెనునందు మనుష్యుడు ఓటమిని చవిచూచినది వాస్తవమే. అతని యొక్క ప్రాణము,  సాతాను యొక్క వంచనచే మోసపోయెను. అయితే ప్రభువు మనిష్యుడ్ని ఓటమియందే నిలిచి ఉండనివ్వలేదు. అట్టి ఓటమినే  విజయముగా మారునట్లు చేసెను.  యేసుక్రీస్తు సిలువయందు తన రక్తమును చిందించెను. అట్టి రక్తము ద్వారా శత్రువును జయించెను. మనలను జయించిన వారిగా చేసెను.

క్రీస్తు యొక్క గాయపడిన హస్తములు మీయొక్క జీవితమును మలిచేటువంటి హస్తముగా ఉన్నాయి. మీయొక్క ఓటమినంతటిని ఆయన  జయముగా మార్చుచున్నాడు. జిగట మన్నైనదియును,  విరిగినదియునైన  పాత్రులైన మిమ్ములను ఆశీర్వాదపు పాత్రులుగా మలచుచున్నాడు. ఓటమి చేత మనస్సు విరక్తిచెంది నిస్స్ ప్రయోజకులుగా ఉన్న మిమ్ములను కృపగల పాత్రలుగా రూపించెను. దేవుని బిడ్డలారా, మీకు జయము నిచ్చుచున్న దేవునిని, మిమ్ములను జయించినట్లు చేయుచున్న దేవునిని కృతజ్ఞతతో స్తోత్రించుడి

 నేటి ధ్యానమునకై: “మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో  ఊరేగించుచున్న  దేవునికి స్తోత్రము”    (2.కోరింథీ. 2:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.