Appam, Appam - Telugu

సెప్టెంబర్ 29 – ఆశ్చర్యమైన ప్రశ్నలు!

“అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములును ఇతనికెక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు  కాడా?…… అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి”    (మత్తయి. 13:54-57

యేసు పెరిగిన ఊరైయున్న నజరేతునందు గల జనులలో, యేసుక్రీస్తు ఎవరు అనుటయందు, గొప్ప చర్చ కలిగెను.  వారు యేసుక్రీస్తును లోకప్రకారముగానే చూచిరి.    “ఇతడు వడ్లవాని కుమారుడు  కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే ఉన్నారు కారా?  అనియంతా చెప్పుకొని అభ్యంతరపడిరి. ఆయనను రక్షకుణిగా గాని, మెస్సయ్యగా గాని వారు ఎరుగలేదు.

దక్షిణ అమెరికానందు ఒక ప్రాచీన ఆదివాసులు నివసించుచు ఉండిరి. బాహ్యప్రపంచముతో వారికి ఎట్టి సంబంధమును లేక, కౄరమైనవారై ఉండిరి.  వారికి జన్మించేటువంటి పిల్లలకు చాలినంత బలము లేన్నందున, పెద్దవారు చెడు అలవాట్లకు బానిసలైయున్నందున అక్కడ మరణము యొక్క సంఖ్య అత్యధికముగా ఉండెను. వారికి ఆరోగ్యమును, విద్యను, నాగరీకతను తీసుకొని వచ్చుటకై ఎంతోమంది ప్రయత్నించగా, వారి అందరిని ఈ కౄరజనులు బాణములను వేసి చంపి వేయుట అలవాటైయుండెను.

అయినను, జిమ్ ఎలియట్ అను దైవజనుడు, వారిపై మిగుల జాలి కలిగినవాడై, ఎలాగైనను వారికి సహాయము చేయవలెనని తీర్మానించి, కొంతమంది సేవకులతో వారిని సంధించుటకు వెళ్లెను. వారికి ప్రభువును, ఆయన యొక్క ప్రేమను ప్రకటించవలెను అనుటయే ఆయన యొక్క ఉద్దేశమైయుండెను. అయితే, ఆ ఆదివాసి ప్రజలు, ఆయనను, అతనితో కూడా వెళ్లిన వారందరిని బాణములను వేసి చంపివేసిరి. వారి యొక్క సేవములను ఒక నది తీరమునందు ఎత్తి పడవేసిరి.

కొన్ని మాసములకు తరువాత, జిమ్ ఎలియట్ యొక్క భార్య, అదే భారముతో భర్త హతసాక్షిగా మరణించిన అట్టి ప్రాంతమునకు వెళ్లి, అక్కడ ఉన్న ఒక ఆదివాసి చిన్నదాని యొక్క సహాయముతో సువార్తను ప్రకటించెను. కల్వరి వద్దకు సమకూర్చి రప్పించి, వారికి క్రీస్తు ద్వారా వచ్చుచున్న పాప క్షమాపణను, సంతోషమును బోధించెను. వారికి వైద్య సదుపాయము మరియు విద్యా జ్ఞానము మొదలగునవి లభించునట్లు చేసెను.

దీనికంటే గొప్ప స్థాయిలో మనకు సహాయము చేయుట కొరకే, పరలోకపు రాజాధిరాజైయున్న యేసు భూమికి దిగివచ్చెను. లోకము యొక్క పాపమును, శాపమును పారద్రోలి, సాతాను యొక్క బానిసత్వము నుండి విడుదల చేయుటకై, కనికరము గలవాడై వచ్చెను.  ఆదినముల యందు గల ప్రజలు ఆయన యొక్క ఆంతర్యమును గ్రహించుకొనలేదు. ఆయన ఎవరన్న సంగతిని కూడా తెలుసుకొనలేదు. ఇతడు వడ్లవాని కుమారుడు కదా అనియంతా శరీర ప్రకారముగా తలంచి ఆయనను సిలువయందు కొట్టించిరి.

దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితమునందు ముఖ్యమైన ఉద్దేశము క్రీస్తును తెలుసు కొనుటయైయున్నది. ఆయనయే మీ కొరకు శరీరదారుడై, తనే తన యొక్క మాంసపు శరీరమును సిలువయందు పాప నివారణపు బలిగా అప్పగించుకొనెను. ఆయనే లోకము యొక్క పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల (యోహాను. 1:29).

నేటి ధ్యానమునకై: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, ఇవి వ్రాయబడెను”     (యోహాను. 20:31).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.