Appam, Appam - Telugu

ఫిబ్రవరి 26 – ప్రకాశవంతమైన మనోనేత్రములు!

“ప్రభువైన యేసుక్రీస్తు మీకు జ్ఞానమును (ప్రత్యక్షతయునుగల మనస్సు) ప్రకాశవంతమైన మనోనేత్రములను అనుగ్రహించునట్లు,  నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను” ‌  (ఎఫెసీ. 1:19)ఎఫెసీసంఘమునకు మాత్రము గాక, మనలోని ప్రతి ఒక్కరి కొరకును, అపోస్తులుడైన పౌలు ‌ చేసిన ప్రార్ధన ఇది.  మనకు ప్రకాశవంతమైన మనోనేత్రములు ఉండవలెను అని ఆయన కోరుచున్నాడు. నేత్రములలో శరీర సంబంధమైన నేత్రములు కలదు, ఆత్మసంబంధమైన నేత్రములు కలదు.

కీర్తనకారుడు,   “నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము”  అని ప్రార్ధించెను. అది ప్రత్యక్షతలను,  అర్థము చేసుకునేటువంటి జ్ఞానపు నేత్రములు. అదేవిధముగా ఆత్మలను వివేచించేటువంటి  నేత్రములు కలదు. నిత్యత్వమును తేరిచూచేటువంటి దర్శనపు నేత్రములును కలదు.

ప్రకాశవంతమైన మనో నేత్రములచే మూడు ప్రాముఖ్యమైన దైవ రహస్యములను గూర్చి గ్రహించగలము. మొదటిగా, ప్రభువు మిమ్ములను పిలిచినందున కలిగేటువంటి మేళ్లు  ఏమిటి అనుటైయున్నది.  రెండవది, పరిశుద్ధుల వద్ద మీకు కలిగి ఉండేటువంటి  స్వాస్థ్యమైయున్న మహిమ ఐశ్వర్యము. మూడోవది, విశ్వాసుల వద్ద దేవుడు కనబరచుచున్న ఆయన బలాతీశయము యొక్క ఔనత్యపు మహత్యము. వీటిని గ్రహించుట కొరకు మీకు ప్రకాశవంతమైన  మనోనేత్రములను దేవుడు అనుగ్రహించవలెను అని పౌలు ప్రార్థించుచున్నాడు.

దమస్కు మార్గమునందు దేవుడు గొప్ప వెలుగుతో సౌలును దర్శించినప్పుడు, అట్టి మహిమను తట్టుకోలేక, సౌలు యొక్క శరీరప్రకారమైన కన్నులు గుడ్డి తనమాయెను.  అయితే,    “ప్రభువా, నీవు ఎవరు? నిన్ను ఎరగవలసిన రీతిలో నేను నిన్ను ఎరగవలెను”  అని ఆయన ప్రార్ధించినప్పుడు, ప్రభువు ఆయన మనో నేత్రములను ప్రకాశింపజేసి, అనేక సత్యములను బయలుపరచెను. సౌలు పౌలుగా మారెను.

ఇంకను దేవుని యొక్క ప్రత్యక్షతలను ఎరుగునట్లు, మూడు సంవత్సరములు అరబు దేశమునకు వెళ్లి, ఏకాంతమునందు అత్యధిక లోతైన దేవుని ప్రత్యక్షతలన్నిటిని గ్రహించుకొనెను. ఆత్మ సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటితో సంబంధ పరచి దేవుని యొక్క శరీరమైయున్న సంఘమునకు మంచి ప్రత్యక్షతలను తీసుకొని వచ్చెను.

ఉదాహరణమునకు ఒక గృహప్రవేశపు ఆహ్వానము మీకు వచ్చుచున్నట్లు ఉంచుకొనుడి. మీకు సన్నిహిత స్నేహితుడు ఒక గృహమును కట్టియున్నాడు. ఆ గృహప్రతిష్ట వేడుకకు మీరు వచ్చి అభినందనలు తెలియజేయాలని ఎదురుచూస్తున్నారు.  మీ వద్దకు మరొక వ్యక్తి వచ్చి, గృహప్రతిష్టను గూర్చి వివరము అడుగుచున్నప్పుడు మీరు మరలా ఆ ఆహ్వానపు పత్రికను క్షుణ్ణముగా చూసిన తర్వాత వివరాలను చెప్పగలుగుచున్నారు.

పలు వివరములు ఆ ఆహ్వానపు పత్రికయందు ఉండినను, పైపైనే మీరు చదివి వెళ్ళుట చేత,  ప్రాముఖ్యమైన అంశములు మీ యొక్క మనస్సునందు నిలిచి ఉండలేకపోవుచున్నది.  దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథమును చదువుతున్నప్పుడు కూడాను క్షుణ్ణముగాను, పూర్తి శ్రద్దతోను చదివితేనే గాని అందులో గల సత్యములు మీకు అర్థమగును. అప్పుడే ప్రభువు యొక్క ప్రేమ ఎంత లోతైనది అనియు, ఆయన మీపై ఉంచియున్న  శాశ్వతకాలపు ఉద్దేశమును, మీకు బయలుపరచబడి మిమ్ములను పరవశింపచేయును.

నేటి ధ్యానమునకై: “ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు”    (ఎజ్రా. 9:8).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.