Appam, Appam - Telugu

ఆగస్టు 15 – కానా అను ఊరునకు మరల

కానా అను ఊరునకు మరల

“తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని  కానాకు ఆయన తిరిగి మరలా వచ్చెను”    (యోహాను.4: 46)

కానా అను పేరు నందు రెండు, మూడు ఊరులు ఉండుటవలన, వాటిలో నుండి తాను అద్భుతమును చేసిన కానా ఊరును ప్రత్యేక పరచి చూపించుటకై,   “గలిలయలోని కానాను”  అని  పిలిచెను. యేసు కానాను అను ఊరిలో ప్రవేశించినప్పుడు, తన యొక్క మొదటి అద్భుతమును అక్కడ చేసెను.

అది ఒక వివాహపు గృహము. ఆ ఇంటి వారి యొక్క పిలుపును అంగీకరించి ఆ వివాహపు వైభవమునందు ప్రేమతో పాలు పొందెను. అక్కడ ఏర్పడిన కొదువను నివర్తిచెసెను. నీటిని ద్రాక్షసముగామార్చి అద్భుతమును చేసెను.  యేసు తన్ను ఆహ్వానించు వారి ఇంటికి వెళ్లి, అక్కడ అద్భుతమును చేసి, ఇంటి వారి యొక్క అవసరతలను దర్శించును అనుట ఈ సంఘటన మనకు తెలియజేయుచున్నది. మీ గృహమునందు కూడాను అద్భుతమును చేయునట్లు యేసును ఆహ్వానించుడి.

యేసు ఒక్కసారి కూడా వెళ్ళని వందల కొలది గ్రామములు ఇశ్రాయేలు దేశమునందు ఉండినప్పటికీను, ఈ కానా అను ఊరు రెండింతల ఆశీర్వాదమును పొందుకొనెను. యేసు ఎందుకని తిరిగి మరల ఆ కానా అను ఊరికి వెళ్లెను? యేసు అద్భుతమును చేయుటకే మరలా తిరిగి కానా అను ఊరికి వచ్చెను.  అప్పుడు కపెర్నహూములో రాజుగారి యొక్క మనుష్యులలో ఒక ప్రధాని కుమారుడు రోగియైయుండెను. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “అతడు విని ఆయనయొద్దకు వెళ్లి,  (యేసుని వద్దకు) తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను”.   (యోహాను. 4:47). యేసు అతనిని చూచి:   “యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో  చెప్పగా;  ఆ మనుష్యుడు, యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను”    (యోహాను. 4:50). యేసు చెప్పిన ఆ గడియలోనే ఆ ప్రధాని యొక్క కుమారుడు జ్వరము వీడి స్వస్థత పొందెను.

కానా అను ఊరునకు మరొక్క శ్రేష్టత కలదు.  యేసు యొక్క పండ్రెండు మంది శిష్యులలో ఒకడు నతనయేలు. నతనయేలు అనుటకు  “దేవుని యొక్క కోట”  అని అర్థము.  ఒకవేళ ఆయన క్రీస్తు కానా అను ఊరిలో చేసిన అద్భుతమును చూచి తరువాత, యేసును వెంబడించి ఉండవచ్చును. యోహాను వ్రాసిన సువార్తయందు ఇతని యొక్క పేరు నతనయేలు అనియు, మిగతా సువార్తల యందు బర్తలోమియా అనియు చెప్పబడియున్నది.

మన కుటుంబములయందు కూడాను అద్భుతములను చేయుటకు ప్రభువు ఆసక్తిగలవాడై యున్నాడు. కానా అను ఊరిలో వివాహమునందు అద్భుతము చేయుటకు మరియా పిలిచినట్లుగాను, లేక రాజు యొక్క ప్రధానులలో ఒకడు తన కుమారుని స్వస్థపరచుటకు యేసును పిలిచినట్లుగాను మనము ఆయనను మన యొక్క కుటుంబమునందు ప్రార్థించి ఆహ్వానించుచున్నామా?

దేవుని బిడ్డలారా, ప్రభువు మీ అంతరంగమునందున వచ్చి  అక్కడ నివాసము చేయుచున్నాడు. కానా అను ఊరి కంటే మీరు ప్రత్యేకమైన వారు. మీద్వారా ప్రభువును వెంబడించుచున్న శిష్యులును అపోస్తులులును లేపబడవలెను. ప్రభువు మిమ్ములను కృపగల ఆత్మతోను, శక్తితోను నింపి ఆశీర్వదించును.

 నేటి ధ్యానమునకై: “ఫిలిప్పు నతనయేలును కనుగొని: ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పెను”    (యోహాను.1:45)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.