Appam, Appam - Telugu

అక్టోబర్ 21 – జ్ఞానపు కావ్యము

“నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును”     (సామెతలు. 5:21) 

సామెతల గ్రంథము    “జ్ఞానపు కావ్యము” అని పేరు పొందుకొనుచున్నది.  పూర్వకాలము నుండి ఒక సమూహపు ప్రజలు జ్ఞానమును వెదకి, పరిశీలించి, వెంబడించుటకు ప్రారంభించిరి. అప్పటి కాలపు ఋషులు పూర్వకాలపు తాళ పత్రములను విడిచిపెట్టక చదివి, మతముల యొక్క తత్వ జ్ఞానమును, బంగారమును, ధన నిధిని వెదుకుచున్నట్లు వెతికిరి. అటువంటివారు పూర్వపు ఇశ్రాయేలు దేశమునందు ఉండిరి.

పాత నిబంధన నాలుగు భాగములగా విభజింపబడుచున్నది. మొదటిది, చరిత్ర. రెండోవది, శాసనము. మూడోవది, జ్ఞానపు కాండములు. నాల్గోవది, ప్రవచనపు మాటలు. యిర్మియా సెలవిచ్చుచున్నాడు:    “యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు”    (యిర్మియా. 18:18). జ్ఞానపు కావ్యముగా బైబిలు గ్రంధమునందు యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలగు గ్రంథములు ఉన్నాయి.

ఇశ్రాయేలు దేశమునందుగల ప్రవక్తలను యాజకులను జనుల యొక్క ఆత్మీయ మత ఆచారపు మార్గములయందే అక్కరకలిగియుండిరి. అయితే తత్వజ్ఞానులు లోక ప్రకారమైన జ్ఞానమును, జీవిత విధానమును,  విజయవంతమైన జీవితపు రహస్యమును బోధించిరి. జీవితము యొక్క తత్వాలను బయలుపరిచిరి.

వారి యొక్క గురి ఏమిటి?  లోకమనేది జ్ఞానము చేత స్థిరపరచబడియున్నది. జ్ఞానమును అన్వేషించుచున్నవారు, ప్రపంచము వారు కొరకే కలుగజేయబడియున్నది అను సంగతిని గ్రహించి దానిని స్వతంత్రించుకొందురు.

సామెతల గ్రంథము నందు, భూమిమీద జీవించుచున్న ఒక మనిష్యునికై శ్రేష్టమైన ఆలోచనలు వ్రాయబడియున్నది. ఇది లోక ప్రకారమైనదియు, అదే సమయమునందు ఆత్మ సంబంధమైనదిగా ఉండుట చేత ప్రత్యేకతను కలిగియున్నది. ఇటువంటి శ్రేష్టమైన జ్ఞానపు కావ్యమును మన యొక్క పాఠశాలలయందును, కళాశాలలయందును పాఠ్యపుస్తముగా ఉంచక పోవుట గొప్ప నష్టమైయున్నది. దుఃఖకరమైన అంశమైయున్నది.

విద్యా సంస్థలే సామెతల గ్రంథ పుస్తకమును పక్కన పెట్టెను అంటే, అనేక క్రైస్తవ సంస్థలు కూడా ఈ గ్రంథమును అవశ్యముగా అంగీకరించుటలేదు. ఈ గ్రంథమును  సొలోమోనేగా వ్రాసినది అని త్రోసివేయుచున్నారు.  అయితే అది లేఖన గ్రంథమునందు ఒక ప్రాముఖ్యమైన భాగము అను సంగతిని,  యెహోవలన అనుగ్రహించబడిన ఒక సంగతి అనియు మరచిపోవుచున్నారు.  ఏ సంఘమైతే తన యొక్క విశ్వాసులను, ఆలయమునందుగల యవనస్థులను సామెతల గ్రంథ పుస్తకమును చదువుటకు ప్రాముఖ్యతను ఇయ్యదో, అట్టివారు సంఘమునకు, సంఘ ప్రజలకు గొప్ప ముప్పును తెచ్చి పెడుతున్నారు అను సంగతిని గ్రహించుకొనవలెను.

దేవుని బిడ్డలారా, జ్ఞానపు కావ్యముల మీద ఒక అమితమైన ప్రేమను, ఆసక్తిని కలుగజేసుకొనుడి. సామెతల గ్రంధమునందు గల ప్రతి ఒక్క వచనమును పరిశీలించి గ్రహించి ధ్యానించుడి. చదువుచున్న సత్యములను మీయొక్క జీవితమునందు అభ్యసింప చేయుటకు ప్రయత్నించుడి. అప్పుడు మీ యొక్క జీవితమంతయు సంపూర్ణముగా దేవుని జ్ఞానము చేత నింపబడియుండును.

నేటి ధ్యానమునకై: 📖”జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు; వివేచన కలిగిన నరుడు ధన్యుడు”     (సామెతలు. 3:13).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.