SLOT QRIS bandar togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

డిసెంబర్ 04 – డిసెంబర్

“నేను నడచు(మార్గము) త్రోవ ఆయనకు తెలియును” (యోబు. 23;10)

భక్తుడైన యోబు వెళ్ళిన త్రోవ ఎవరును ఎరుగలేని ఒక అంశమైయున్నది. యోబు యొక్క భార్య ఆయనను దూషించి చెయ్యి విడచిపెట్టెను. ఆయన యొక్క స్నేహితులు ఆలోచన చెప్పుచున్న వంకతో వచ్చి పచ్చి పుండు పై కారమును జల్లినవారై ఉండెను. అట్టి శ్రమల మధ్యలోను యోబు భక్తుడు చెప్పుచున్న మాటను గమనించి చూడుడి. “నేను నడచు (మార్గము) త్రోవ ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” అని ఆయన చెప్పెను. ప్రభువు మీరు వెళ్ళుచున్న ఉపద్రవాల బాటను, వేదనగల మార్గమును నిశ్చయముగానే ఎరుగును.

ప్రభువు మోషేతో మాట్లాడుచున్నప్పుడు: “నా ప్రజల బాధను …. వారి దుఃఖములు నిశ్చయముగా నాకు తెలిసేయున్నవి” (నిర్గమ. 3:7) అని చెప్పెను. అవును, మనము ప్రభువు యొక్క ప్రజలుగాను, ఆయన యొక్క స్వాస్థ్యముగాను ఉన్నందున ఆయన మన యొక్క ప్రతి అంశమును ఎరిగియున్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను విమోచించినట్టుగానే సమస్త బానిసత్వపు వేధనల నుండి మనలను విమోచించుచున్నాడు.

కీర్తనకారుడు కూడాను, తన త్రోవను ప్రభువు ఎరిగియున్నాడు అను విశ్వాసముతో కూడా, “నా మూర్ఖతవలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను” (కీర్తనలు. 38:5,6) అని చెప్పెను. అవును దావీదు యొక్క దీనస్థితినంతటిని ఎరిగిన ప్రభువు, దావీదు యొక్క శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచి దావీదును తన పరిశుద్ధ ఆత్మ యొక్క నూనెతో అభిషేకించెను.

ఒకసారి అమెరికా సమైక్యరాజ్యాలను స్థాపించిన జార్జ్ వాషింగ్టన్ దేశమునందు ఏర్పడిన అల్లర్లలో చిక్కుకుని, విరోధుల చేత తరుమబడి ప్రాణాలు కాపాడుకొనుటకు పారిపోయెను. విరోధులు ఆయనను పట్టుకొనుటకు గుర్రములతోను, తుపాకీలతోను ఆయనను తరుముచు వచ్చిరి. అయితే ఆయన కాలినడకతో, పూర్ణ బలముతోను, అట్టి రాత్రి సమయమునందు తప్పించుకొనుటకు పరుగులు తీస్తూనే ఉండెను. అప్పుడు దారి మధ్యలో ఒక నది అడ్డుగా వచ్చెను. అది అతిభయంకరమైన చలికాలముగా ఉండినందున, ఆ నది యొక్క పై భాగమంతయును మంచు పలకగా పేరుకుని పోయియుండెను. చల్లటి నీటిలో దిగినట్లయితే శరీరము వెరచుకుని మరణించే పరిస్థితి తఠస్థించును.

కావున, ఒక నిమిషము ఆ నదీతీరమునందు ఆయన మోకరించి, ఆ చల్లటి నీటిలో ఈదుటకు తన్ను బలపరచుమని గోజాడి ప్రార్థించేను. ఆ క్షణమే నీటిలో దూకి పూర్ణ బలముతోను, బహు వేగవంతముగాను, ఆ సమయమునందు ఆసక్తిగల ప్రార్థనతోను ఆయన ఈదుటకు ప్రారంభించెను. దేవుని యొక్క శక్తి ఆయనను నింపినందున, అట్టి భయంకరమైన చలి ఆయనకు ఏ హానియు చేయలేదు. అవతలి ఒడ్డునకు చేరుకొని కొనసాగించి పరిగెత్తుచూనే ఉండెను. కొంత సమయము గడచిన తర్వాత శత్రువులు ఆ నదీ తీరమునకు వచ్చిరి. ఏ ఒక్కరికైనను ఆ మంచు పేరుకొనిపోయిన నదిలో ఈదుకొని వెళ్ళుటకు ధైర్యము లేకుండెను. వారు అలాగునే నిలుచుండిపోయిరి.

జార్జ్ వాషింగ్టన్ యొక్క ఇకటైన పరిస్థితిని ఎరిగి, ఆయనకు సహాయము చేసిన ప్రభువు నిశ్చయముగానే మీయొక్క సమస్యలు అన్నిటిని కూడా ఎరుగును. వాటి మధ్యలో మీకు జయమును ఇచ్చుటకు ఆయన శక్తి గలవాడైయున్నాడు.

నేటి ధ్యానమునకై: “ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే” (1. కోరింథీ. 8:2,3).

 

Leave A Comment

Your Comment
All comments are held for moderation.