No products in the cart.
జూన్ 29 – “మన్నును విన్నును!”
“మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము, పరలోకసంబంధి పోలికయు ధరింతుము” (1. కోరింథీ. 15:49).
ప్రభువు మనలను తన యొక్క స్వహస్తాలతో మన్ను నుండి కలుగజేసెను. తన యొక్క పోలికను స్వారూప్యమును మనకు అనుగ్రహించి మనలను జీవాత్మగా చేసెను. కావున మనము సమస్త సృష్టియందును ప్రత్యేకమైన వారిగా ఉన్నాము.
ఒక దినమున అబ్రహామును ప్రభువు ఒంటరిగా పిలచి తీసుకొచ్చి ఆయన యొక్క సంతతిని చూపించెను. ఎంతటి ఆశ్చర్యము! మన్నుకు సంబంధించిన మనుష్యుడు విన్నుకు సంబంధించిన నక్షత్రముగా ప్రకాశింపబోవుచున్నాడు అను సంగతియే ఆ దృశ్యము (ఆది.కా. 15:1-6).
అబ్రహాము యొక్క అంతరంగము ఎంతగా ఆనందించి ఉండును! దేవుడు మనిష్యుని తన యొక్క పోలిక చొప్పునను, స్వారూప్యము చెప్పునను సృష్టించుటకు గల ముఖ్య కారణము అతనికి పరలోక పోలికను ఇచ్చుట కొరకే.
మొదటి ఆదాము మన్నునుండి కలుగచేయబడెను. అయితే రెండవ ఆధామైయున్న యేసు విన్నునుండి దిగివచ్చినవాడు. అనేకమంది పిల్లలను మహిమలోనికి సమకూర్చి చేర్చునట్లుగా యాకోబు యొక్క నిచ్చెనగా మారేను. అట్టి నిచ్చనయే కల్వరి సిలువ.
యేసు పరలోకపు అంశములను చెప్పుచున్నప్పుడు ప్రజలు విశ్వసించలేదు. వాటిని గ్రహింపను లేదు. “భూసంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? అని అడిగెను (యోహాను. 3:12).
విన్నును గూర్చిన సంగతులను వివరించి చెప్పగలవాడు ఒకరు ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తే. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “పరలోకము నుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” (యోహాను. 3:13).
దేవుని యొక్క బిడ్డలమైయున్న మనకు ఒక గొప్ప కాంక్షకలదు. మన్నునకు సంబంధించిన మనము నిత్యా నిత్యముగా విన్నునందు, పరలోక రాజ్యమునందు కనబడుదుము. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు” (దాని. 12:3).
“ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు; ఆకాశవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. మంటినుండి పుట్టిన వాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము” (1. కోరింథీ. 15:40,48,49).
దేవుని బిడ్డలారా, “మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు” (కొలస్సీ. 3:1).
నేటి ధ్యానమునకై: “మన పౌరస్థితి పరలోకము నందున్నది; అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టు కొనియున్నాము” (ఫిలిప్పీ. 3:20).