Appam, Appam - Telugu

జనవరి 27 – అంశము:- “నూతన జీవము!”

“కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు”   (రోమీ. 6:4) 

మీరు నూతన జీవము పొందుకున్నవారై నడుచుకొనవలెను. తండ్రి మహిమ వలన, క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, మీరును లేపబడబడలెను.

ఇతర మార్గములకును, క్రైస్తవ మార్గమునకును మధ్య ఒక గొప్ప వ్యత్యాసము కలదు.  వాటియందు గల మత స్థాపకులు మరణించి మట్టితో మట్టై కలిసిపోయిరి. వారి యొక్క సమాధులు మూయబడియున్నవి. అయితే క్రీస్తు మరణించెను, పాతి పెట్టబడెను, మూడవ దినమునందు సజీవముగా తిరిగి లేచెను! ఈ సంగతిని ఎవరును కాదని అడ్డుచెప్పలేని చరిత్రలోని వాస్తవము.

అయితే ఈ సత్యమును కేవలము చరిత్రగా మాత్రము భావించకూడదు. మీరు సిలువ వద్దకు వచ్చి నిలబడి,   “నా కొరకే మరణించెను, నా కొరకే పాతి పెట్టబడెను, నా కొరకే తిరిగి జీవమతో లేచి జీవించుచున్నాడు” అని విశ్వాసముతో ప్రకటించుటకు నేర్చుకోవలెను అప్పుడే ఆ సిలువ యొక్క త్యాగము మీయొక్క జీవితమునందు రక్షణగా వికసించును.

ప్రవక్తయైన యెషయా సెలవిచ్చుచున్నాడు:   “మన యతిక్రమక్రియలనుబట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములనుబట్టి  ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను;  ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది”   (యెషయా. 53:5).

ఇక దాని తర్వాత స్థాయికి మీరు వచ్చి తీరవలెను.   “యేసుతో పాటు సిలువ వేయబడియున్నాను. యేసుతో పాటు పాతి పెట్టబడియున్నాను. ఇక మీదట యేసుతో పాటు పునరుద్దానపు శక్తి చేత విజయవంతమైన పరిశుద్ధ జీవితమును జీవించెదను”  అని మిమ్ములను మీరు సమర్పించుకొనవలెను. అదియే నూతన జీవము పొందినవారై జీవించు జీవితము. అదియే విజయవంతమైన పరిశుద్ధ జీవితము. ఎవరెవరు యేసుతో కూడా పెట్టబడియున్నారో వారే ఆయనతో కూడా పునరుద్ధానులైయుందురు.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము”    (రోమీ. 6:5).

“ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు, పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన (స్వభావము) పురుషుణ్ణి ఆయనతోకూడ సిలువ వేయబడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు. కావున  మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము”   (రోమీ. 6:6-9).

ఇట్టి అనుభవములోనికి మీరు వచ్చినట్లయితే, నూతన జీవముతోను, నూతన శక్తితోను, క్రీస్తు యొక్క మహిమతోను జీవించెదరు. క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణగా, పునరుత్థానపు జ్యోతిగా మీయందు ఆసీనుడై యుండును. ఇక మీదట పాపము మిమ్ములను ఎన్నడును అధిగమించజాలదు.

నేటి ధ్యానమునకై: 📖”నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి యున్నాము”   (గలతి.6:14)..

Leave A Comment

Your Comment
All comments are held for moderation.