Appam, Appam - Telugu

అక్టోబర్ 22 – కొండలు!

“నాకు సహాయము వచ్చు కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను”   (కీర్తన. 121:1)

“కన్నుల నెత్తుచున్నాను!” అవును,  సహాయము వచ్చు కొండల తట్టుగా కన్నులెత్తుట, ప్రార్థనలోని ఒక భాగమైయున్నది. నోటితో గొప్ప శబ్దముతో ప్రార్థించుట మాత్రమే ప్రార్థన అని తలంచకూడదు. ప్రభువును తేరి చూచుటయును, కాంక్షతో కన్నులను ఎత్తుటను కూడా ప్రార్థనయైయున్నది.

దావీదు రాజు యొక్క కన్నులు, మనుష్యుల సహాయమును కోరి మనుష్యుల యొక్క ముఖమును గాని, అధికారుల యొక్క ముఖమును గాని, ధనవంతుల యొక్క ముఖమును గాని, తేరి చూడలేదు. ఆయన యొక్క కన్నులు ఆకాశమును భూమిని కలుగజేసిన ప్రభువునే తేరి చూచెను.

బైబిలు గ్రంధము నందు 150 కీర్తనలు ఉండినను అందులో మూడు కీర్తనలు మిగుల ప్రాముఖ్యతను వహించుచున్నవి.   ‘యెహోవా నా కాపరి’ అను పధములను కలిగియున్న 23 ‘వ కీర్తన.  ‘మహోన్నతుని చాటున నివసించువాడే’ అను మాటలను కలిగియున్న 91 ‘వ కీర్తన. మరియు, ప్రభువు యొక్క సహాయమును కాంక్షతో ఎదురుచూచు 121 ‘వ కీర్తన. మొదలగు ఈ మూడు కీర్తనలును ప్రాముఖ్యమైనవి. పాఠశాలకు వెళ్ళు ప్రాయమునందే క్రైస్తవుల యొక్క హృదయమునందు బహు లోతుగా పదిలపరచ బడియున్న  కీర్తనలు ఇవి.

సహాయము వచ్చు కొండలు’  అని దావీదు రాజు బహు వచనమునందు చెప్పుచున్నాడు. కొండ ఒక్కటే, అయితే కొండయందు మూడు పర్వతములు ఉన్నాయి. ప్రభువు ఒక్కడే, అయినను, తండ్రి ,కుమారుడు, పరిశుద్ధాత్ముడు అను మూడు విధములయందు మీకు సహాయము వచ్చుచున్నది. తండ్రి యొద్ద నుండి ప్రేమ, బలము, పరాక్రమము, మహిమలన్నియును మీకు వచ్చుచున్నది.

యేసు అను పర్వతము నుండి కృపయును, కనికరమును, వచ్చుటతోపాటు, ఆయన యొక్క రక్తము మీ తట్టు యేరుగా ప్రవహించుచు వచ్చుచున్నది. పరిశుద్ధాత్ముడు అను పర్వతము నుండి అభిషేకమును, అగ్నియు, వరములును బయలుదేరి వచ్చుచున్నది.

నేటి ధ్యానము యొక్క ప్రారంభమునందు చోటు చేసుకునిన వాక్యమును ఆంగ్ల బైబిలు గ్రంధమునందు చదువుచున్నప్పుడు ఇంకా స్పష్టమైన సత్యమును అది బయలుపరచుటను చూడవచ్చును.   “నేను కొండవలె నమ్మియున్న మనుష్యుల వంటి పర్వతముల నుండియా నాకు సహాయము వచ్చును? లేదు. ఆకాశమును, భూమిని కలుగజేసిన ప్రభువుయొద్ద నుండియే నాకు సహాయము వచ్చును” అను అర్థమునిచ్చు రీతిలో వ్రాయబడియున్నది.

కొందరిని మీరు కొండవలె నమ్మి ఉండవచ్చును. వారే నాకు సహాయము చేయుదురు అని ఎదురుచూచి ఉండవచ్చును. అయితే అట్టి కొండయే తొలగిపోవుచున్నది. నమ్మియున్న మీకు చివరిగా లభించేది ఏమరుపాటును, శూన్యమును.

ప్రభువు సెలవిచ్చుచున్నాడు:   “కొండలు (పర్వతములు)  తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు”   (యెషయా.54:10).

దేవుని బిడ్డలారా, మీ యొక్క నమ్మిక ఎవరిపైయున్నది? మనుష్యుల మీదన? లేక ప్రభువు మీదన? క్షయమైపోవు లోకవస్తువుల మీదన లేక అక్షయమగు కృపగల దేవుని మీదన?

 నేటి ధ్యానమునకై: “యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు,  యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును”    (కీర్తన.  125:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.