No products in the cart.
అక్టోబర్ 17 – దర్శనము పొందిన ఐదివందల మంది!
“మీ ముసలివారు కలలనుకందురు, మీ యౌవనులు దర్శనములను చూతురు” (యోవేలు. 2:28
క్రీస్తును సమీపించి వచ్చుటకును, లేఖన వాక్యములను వినుటకును క్రీస్తుని వద్దకు వచ్చినవారు ఐదువేల మంది. వారిలో క్రీస్తును మరెక్కువగా, సమీపించి చేరినది ఆయన దర్శనమును పొందుకొనినవారు ఐదువందల మంది మాత్రమే. దైవ దర్శనము పొందునట్లు వాంఛతో కొండను ఎక్కిన ప్రజల సమూహములో మీరు కనబడుదురా?
దర్శనము లేని స్థలములయందు ప్రజలు అక్రమకారులై తప్పిపోవుదురు. అవును, మీకు దర్శనము అవశ్యము. ప్రార్థన యందు దర్శనము, ఆత్మలపట్ల దప్పికగల దర్శనము, పరిచర్యను గూర్చిన దర్శనము, నిత్యత్వము యొక్క దర్శనము, అన్నిటికంటే పైగా దేవుని గూర్చిన ముఖాముఖి దర్శనము నిశ్చయముగా కావలెను. అప్పుడే ప్రార్థన యందు ఒక భారము కలుగును. పరిచర్యయందు ఒక ఉజ్జివము కలుగును. ఆత్మల నూర్పిడి సంభవించును. దేవునితో దగ్గరి సత్సంబంధము కలుగును. ధర్శనమును పొందుకొనుటకు ఉన్నత అనుభవములకు ఎక్కి వెళ్లుడి.
యెషయా పొందుకొనిన దర్శనము ఆయనను ఉన్నతమైన ప్రవక్తగా హెచ్చించినది. రాజైన ఉజ్జియా మరణించిన సమయమునందు, “ఇకమీదట ఇశ్రాయేలీయులకు రాజుగా ఎవరు లేవనెత్తబడుదురు” అని ప్రార్థనతో దేవాలయము నందు కనిపెట్టుకొని యున్నప్పుడు, ప్రభువు ఆయనకు దర్శనమును ఇచ్చెను. మొట్టమొదటిగా ప్రభువు ఎవరు అనేటువంటి గ్రహింపు ఆయనకు కలిగెను. రెండోవదిగా తాను ఎవరన్న సంగతిని కూడా స్వయముగా ఆయనే గ్రహించుకొనగలిగెను. “నేను పాపినైయున్న మనుష్యుడను, అపవిత్రమైన పెదవులుగల మనుష్యుడను” అనుటను గ్రహించి ఆయన విలపించుటకు ప్రారంభించెను. అట్టి దర్శనము ద్వారా ఆయన శుద్ధికరింపబడుటను, బైబులు గ్రంథమునందు కనబడుచున్నట్లు బలమైన ప్రవక్తగా హెచ్చింపబడెను.
సమస్యల కొరకు ప్రార్థించుకొనుటకై వచ్చుచున్న ప్రజల యొక్క పరిస్థితిని గ్రహించి, పరిష్కరించుకొనుటకై మార్గములను వారికి చెప్పుటకును, వారిని దేవునితో సమాధానపరచి, పాపపు ఒప్పుకోలు చేయించుటకును ఇట్టి దర్శన వరము మిగుల అత్యవసరమైనదై ఉండును. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “మీలో ప్రవక్తయుండిన యెడల, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసుకొనునట్లు కలలో అతనితో మాటలాడుదును” (సంఖ్యా. 12:6).
అపోస్తులుడైన పౌలునకు, దమస్కునకు వెళ్ళు మార్గమునందు ప్రభువు అతనికి దర్శనమిచ్చెను. ఆ దర్శనము, పౌలు యొక్క జీవిత దినములన్నిటను ప్రభువు యొక్క మార్గమునందు బహు చక్కగా పరిగెత్తుటకు ఆయనకు బలమును ఇచ్చెను. తన పరిచర్య యొక్క అంతిమ దినములు యందు అగ్రిప్పరాజు యెదుట నిలబడు చున్నప్పుడు కూడాను, ఆయన తన రొమ్మును తట్టుకొనుచు, “అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ పరమదర్శనమునకు నేను అవిధేయుడను కాక” (అపో.కా. 26:19) అని చెప్పెను.
ప్రభువు అత్యధిక శాతము సేవకులను దర్శనము ద్వారా పిలిచెను అను సంగతిని ఎరుగగలము. ప్రభువు అబ్రహామునకు దర్శనమిచ్చెను (ఆది. 15:1). ఇస్సాకునకును, యాకోబునకును దర్శనమిచ్చెను (ఆది. 26:2; ఆది. 35:1). ముల్ల పొదయందు మోషేకు దర్శనమిచ్చెను (నిర్గమ. 3:4). బిలామునకు దర్శనమిచ్చెను (సంఖ్య. 24:4). గిద్యోనునకు దర్శనమిచ్చెను (న్యాయది. 6:12).
దేవుని బిడ్డలారా, మీకును దర్శనము ఖచ్చితముగా కావలెను. దిట్టమైన స్థిరమైన దర్శనము కావలెను. దర్శనము లేని జీవితము అపాయకరమైనది అను సంగతి వాస్తవమైనది. ఆనాడు ఐదువందల మంది కంటే అత్యధికమైన వారికి ఒకే సమయమునందు దర్శనమిచ్చినవాడు, నేడు మీకును దర్శనము ఇచ్చుటకు సంకల్పించియున్నాడు. కావున దర్శనము పొందుకొనుటకు అర్హత కలిగినవారై ఎక్కి తరలిరండి.
నేటి ధ్యానమునకై: “నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను” (కీర్తన. 89:19).